Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవంతుడి ఆశీస్సుల వల్లే నారీపూజ పాల్గొనే అవకాశం లభించింది : సినీ నటి ఖుష్బూ

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (15:56 IST)
ఆ భగవంతుడి ఆశీస్సుల వల్లే తనకు నారీ పూజలో పాల్గొనే అవకాశం లభించిందని సినీ నటి ఖుష్బూ అన్నారు. కేరళలోని ఓ ప్రముఖ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆమె పాల్గొన్నారు. ప్రతి యేటా ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగం కావడం తనకు ఆనందంగా ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
త్రిసూర్‌లోని ప్రాచీన విష్ణుమాయ దేవాలయంలో ఏటా ఒకసారి నారీపూజ నిర్వహిస్తుంటారు. దీనిలో పాల్గొనే మహిళను ఆ భగవంతుడే ఎంచుకుంటారన్నది అక్కడి వారి విశ్వాసం. ఈ ఏడాది పూజలో పాల్గొనే అవకాశం నటి ఖుష్బూకు లభించింది. దీంతో ఇటీవల ఆమె విష్ణుమాయ దేవాలయంలో నిర్వహించిన నారీ పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన విశేషాలను తాజాగా ఆమె నెటిజన్లతో పంచుకున్నారు.
 
'ఆ భగవంతుడి విశేష ఆశీస్సులు పొందాను. నారీపూజలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. కేవలం ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పూజలో పాల్గొనే వ్యక్తిని సాక్షాత్తూ ఆ భగవంతుడే ఎంచుకుంటారన్నది అక్కడి వారి విశ్వాసం. మనందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నా. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషం, శాంతితో జీవించాలని కోరుకున్నా" అని ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments