Webdunia - Bharat's app for daily news and videos

Install App

బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్‌: అభిమాని అనుమానాస్పద మృతి

Webdunia
శనివారం, 30 జులై 2022 (14:06 IST)
Bimbisara
బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అయితే, ఈ ఫంక్షన్‌లో ఓ అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం ఆలస్యంగా వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
 
మృతుడిది ఆంధ్రప్రదేశ్‌‌గా గుర్తించారు. కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అభిమాని మృతి చెందడం ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది.  
 
ఇకపోతే.. తాడేపల్లిగూడేనికి చెందిన పుట్టా సాయిరామ్ కూకట్‌పల్లిలో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇతను బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. 
 
ఈవెంట్‌కి వచ్చిన సాయిరామ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దాంతో మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ మృతిపై పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు.

వెస్ట్ గోదావరి జిల్లా, పెంటపాడు మండలానికి చెందిన అభిమాని పుట్టా సాయిరామ్‌(సన్నాఫ్‌ రాంబాబు) మృతి పట్ల `బింబిసార` యూనిట్‌ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈవెంట్‌లో దురదృష్ణవశాత్తు అభిమాని మరణించాడనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపింది.

పుట్టా సాయిరామ్‌ లేదనేది నిజంగా గుండెపడిలే వార్త. ఈ సందర్భంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నామని, సాయిరామ్‌ కుటుంబాన్ని సాధ్యమైన విధంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments