Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌషల్ ఓవరాక్షన్... కారణం బిగ్ బాసేనా?

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ టు 12 వారాలను పూర్తి చేసుకుని 13వ వారానికి చేరువైంది. ఇప్పటికి 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. టాలీవుడ్ మారథాన్ టాస్క్ ముగిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎలా ఉంటారో ఊహించ

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:03 IST)
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ టు 12 వారాలను పూర్తి చేసుకుని 13వ వారానికి చేరువైంది. ఇప్పటికి 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. టాలీవుడ్ మారథాన్ టాస్క్ ముగిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎలా ఉంటారో ఊహించి బొమ్మ వేసి, ఆయన గురించి చెప్పమని కంటెస్టెంట్స్‌కి చెప్పగా పొగడ్తలతో ముంచేసారు. గీత, శ్యామల, దీప్తి ఒకే మంచంపై పడుకుని నిద్రపోవడం లేదని తెలిసేలా పాటలను హమ్ చేస్తూనే ఉన్నారు.
 
కాసేపటికి అందరూ లివింగ్ రూమ్ సోఫాలోకి వచ్చి కూర్చోగా కౌషల్ యథాప్రకారం అమ్మాయిల మీద నోరు పారేసుకున్నాడు. నిద్రపోయి ఫ్రెష్‌గా వచ్చారు అంటూ వీళ్లని పాయింట్ చేసి చెప్పగా గీతా మాధురి అతనితో వాదనకు దిగింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ రోజు పొద్దున కౌషల్ నిద్రపోయినందుకు కుక్కులు మొరిగాయి. అంతేకాకుండా టిక్కెట్ టు ఫినాలే టాస్క్ గురించి బిగ్ బాస్ వివరించగా అందరితో పాటు కౌషల్ సిద్ధంగా ఉన్నాడు.
 
కానీ బిగ్ బాస్ కౌషల్ అన్ని వారాలు నామినేట్ అయినందున ఆయనకు పాల్గొనే అర్హత లేదని, కనుక సంచాలకులుగా వ్యవహరించాలంటూ బిగ్ బాస్ చెప్పారు. ఈ అక్కసు ఆయనలో స్పష్టంగా కనిపించింది. కంటెస్టెంట్స్‌లో చాలా కఠినంగా వ్యవహరించాడు. కారుకు మైక్ టచ్ అయ్యిందని రోల్‌ను అందులో పాల్గొననివ్వలేదు. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఫుల్‌గా వర్షం పడుతుండటంతో చలికి ఒణికిపోతూ దీప్తి దుప్పటి ఇవ్వమని అడగగా, ఒప్పుకోలేదు కౌశల్. ఇంకా ఏమి ఇబ్బందులు పెడతాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments