Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. పుకార్లు సృష్టించవద్దు : నాగబాబు

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (17:33 IST)
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యం పాలయ్యారనీ, అందుకే మంత్రివర్గ సమావేశం నుంచి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అర్థాంతరంగా వెళ్లిపోయారంటూ సాగుతున్న ప్రచారంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన తల్లి ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. 
 
మంగళవారం ఉదయం కొందరు సామాజిక మాధ్యమం యూజర్లు అంజనాదేవి ఆరోగ్యం బాగోలేదని ఆమె ఆస్పత్రిలో చేరారంటూ కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. చిరంజీవి తల్లికి అస్వస్థత, చిరంజీవి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అంటూ ప్రచారం జరిగిందని ఆయన గుర్తు చేశారు. 
 
ఈ వార్తలపై ఆయన స్పందించారు. "మా అమ్మ అంజనాదేవి ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె అనారోగ్యంతో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వదంతులు నమ్మొద్దు" అని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్ధారించుకోకుండా వార్తలు ప్రచారం చేయొద్దని పలువురు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశం జరుగుతుండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం మధ్యలో అర్థాంతరంగా లేచి వెళ్లిపోయారు. దీంతో తల్లి అంజనాదేవికి అనారోగ్యంగా ఉండటం వల్లే ఆయన మీటింగ్ మధ్యలో వెళ్లిపోయారంటూ ప్రచారం సాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

చెన్నైలో పవన్ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే.. ఆయన చెప్పింది వింటాం..

ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments