Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ నాయకులతో తస్మాత్ జాగ్రత్త.. ఏపీ ప్రజలకు పూనమ్ కౌర్ వినతి

Webdunia
సోమవారం, 17 జులై 2023 (15:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సినీ నటి పూనమ్ కౌర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపించడంతో నకిలీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. 
 
ఆదివారం ఆమె చేసిన ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల హక్కులపై గొంతు చించుకుంటున్న నకిలీ నాయకులను నమ్మొద్దంటూ ఏపీ ప్రజలను ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ ఫేక్ లీడర్లు మహిళలకు హక్కులంటూ లేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 
 
అంతగా అభిమానమే ఉంటే ఢిల్లీలో మొన్నటివరకు ఆందోళన చేసిన రైజర్లకు ఎందుకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. తమ సొంత ప్రయోజనాల కోసమే ఏపీలోని నకిలీ లీడర్లు మహిళలపై అభిమానాన్ని, ప్రేమను కురిపిస్తున్నారని విమర్శించారు. 
 
ఇపుడు ఈ పోస్టు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేనాని ఉద్దేశించి పూనమ్ కౌర్ ఈ పోస్ట్ పెట్టిందంటూ మండిపడుతున్నారు. మరోమారు ఇలాంటి ట్వీట్స్ చేస్తే ఏం జరుగుతుందో మీ ఊహకు కూడా అందదని పవన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments