Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య ఓ అణుబాంబు - రాజ‌మౌళి కితాబు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (23:12 IST)
Rajamouli
శ‌నివారం రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన అఖండ ప్రీరిలీజ్ వేడుక‌కు రాజ‌మౌళి హాజ‌ర‌య్యారు. ఆయ‌న ట్రైల‌ర్ చూశాక స్పందించారు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌కు క‌రోనావ‌ల్ల పెద్ద సినిమా జోష్ రాలేదు. ఇప్పుడు బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌తో  అభిమానులకు  మొత్తం చిత్ర పరిశ్రమలో భారీ జోష్‌ను తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. డిసెంబర్ 2న విడుదల కానున్న అఖండ చిత్రంతో సినీ ప్రేమికులు, పరిశ్రమలు కిటకిటలాడాలని రాజమౌళి ఆకాంక్షించారు.
 
“బాలయ్య ఓ అణుబాంబు. సరిగ్గా బాంబ్ ఎలా ప్రయోగించాలో బోయపాటి శ్రీను గారికి మాత్రమే తెలుసు. ఆ రహస్యాన్ని తన దగ్గర ఉంచుకోకుండా అందరితో పంచుకోవాలి’’ అని రాజమౌళి అన్నారు.  బాలయ్య ఎనర్జీ డ్యాన్స్‌లపై రాజ‌మౌళి ప్రశంసలు కురిపించారు. “మేము ప్రోమోలలో చూసినది కేవలం మ‌చ్చుతున‌క‌. అస‌లు ఇంకా చాలా వుంది. మీ అందరిలాగే నేనూ అఖండ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. థియేట‌ర్‌లోనే చూస్తాను. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోని థియేటర్‌లో తప్పకుండా చూస్తాను” అని రాజమౌళి తెలిపారు.
 
ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, సంగీత స్వరకర్త తమన్‌ను అభినందించారు.మొత్తం టీమ్‌కు గ్రాండ్ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. అఖండలో హీరో శ్రీకాంత్, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments