Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య బర్త్ డే.. ఫ్యామిలీ సర్‌ప్రైజ్.. పోర్చుగీసుకు వచ్చారు.. బెంట్లీ కారు తాళాలిచ్చారు..

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత బాలకృష్ణ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం బాలయ్య తన 57వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏడాది తన అభిమానుల మధ్

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (13:12 IST)
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత బాలకృష్ణ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం బాలయ్య తన 57వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏడాది తన అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునే బాలయ్య ఈసారి మాత్రం అభిమానులకు దూరంగా పోర్చుగల్‌లో తన పుట్టినరోజును జరుపుకోవలసి వచ్చింది.
 
ప్రస్తుతం బాలకృష్ణ పూరి దర్శకత్వం వహిస్తున్న 'పైసా వసూల్' సినిమా షూటింగ్ కోసం పోర్చుగల్‌ వెళ్లారు. కానీ బాలయ్యకు పోర్చుగల్‌లో ఆయన కుటుంబీకులు సర్‌ప్రైజ్ ఇచ్చారు. బాలయ్య ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్వి బాలకృష్ణకు అనుకోని సర్పైజ్ ఇచ్చారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అత్యంత ఖరీదైన బెంట్లీ కారును బహుమతిగా ఆయన కుమార్తెలు ఇవ్వడం ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్‌గా మారింది.
 
దాదాపు కోటిన్నర పైగా విలువచేసే ఈ విలాసవంతమైన కారులో అన్నిరకాల లేటెస్ట్ టెక్నాలజీతో పాటు విలాసవంతమైన సౌకర్యాలు కూడ ఉంటాయి. బాలయ్యకు పుట్టినరోజు సందర్భంగా ఈ కారుకు సంబంధించిన తాళాలను బాలయ్య కుమార్తెలు ఆయనకు అందించి షాక్ ఇచ్చారు. ఇంకా సోషల్ మీడియాకు దూరంగా ఉండే బాలకృష్ణ కూడ తన పద్ధతి మార్చుకుని తన పుట్టినరోజునాడు ఫేస్ బుక్ లైవ్ చాటింగ్‌లోకి రావడంతో బాలయ్య కూడ యంగ్ హీరోలతో పోటీ పడుతూ మారిపోయారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
అలాగే బాలకృష్ణ పూరిజగన్నాథ్‌‍ల కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీకి ఎవరూ ఊహించని టైటిల్ పెట్టి బాలయ్య అభిమానుల మైండ్ బ్లాంక్ చేసాడు పూరిజగన్నాథ్. బాలకృష్ణ 57వ జన్మ దినోత్సవ సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈమూవీ టైటిల్ ప్రకటించడమే కాకుండా ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను పూరీ జగన్నాథ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments