''భజరంగీ భాయ్ జాన్'' సినిమాలో సల్మాన్ ఖాన్ పొరపాటున భారత్ చేరిన మాటలు రాని బాలికను పాకిస్థాన్లోని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన కథకు భారీ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పరంగా కాకుండా హృదయాలను హత్తుకున్న భజరంగీ భాయ్ జాన్ సినిమా చూసిన ఓ పాకిస్థానీ మహిళ.. సల్మాన్ ఖాన్ కోసం పాస్ పోర్ట్, వీసా, టికెట్ లేకుండా సంఝౌతా ఎక్స్ప్రెస్లో భారత్ వచ్చేసింది.
చందా (27) అనే మహిళ టికెట్ లేకుండా సంఝౌతా ఎక్స్ ప్రెస్లో భారత్కు వచ్చింది. ఆమెను జలంధర్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకుని అంతారీ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారించిన పోలీసులతో ఆమె వాదనకు దిగింది. తనకు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమని తెలిపింది.
వారి కలిసేందుకు భారత్ వచ్చానని స్పష్టం చేసింది. కుదిరితే వారితో కలవనివ్వండి లేదా పాకిస్థాన్కి పంపించేయండి అదీ కుదరకపోతే కాల్చి చంపేయండి అని స్పష్టం చేసింది. ఈ మూడింటిలో ఏదో ఒకటి చేయండి అని పోలీసులతో వాదనకు దిగింది. దీంతో పోలీసులు తలపట్టుకుని కూర్చున్నారు. ఆ మూడు ఆప్షన్లలో పోలీసులు దేనికి ప్రాధాన్యత ఇస్తారో వేచి చూడాలి.