ఒక ట్రైలర్‌ చూడటానికి థియేటర్లకు పరుగెత్తిన జనం. బ్రేక్ డౌన్ అయిన యూట్యూబ్

రెండున్నర నిమిషాల వీడియో ట్రైలర్ చూడటానికి వేలమంది జనం థియటర్లకు పరుగు తీశారు. ఆన్‌లైన్ వెర్షన్ చూడటానికి తొలిరోజే కోటిన్నరమందికి కీబోర్డుపై వేళ్లు టకటకలాడించారు. ఇది సమకాలీన చలనచిత్ర చరిత్రపై రాజమౌళి చిత్రించిన బాహుబలియన్ ముద్ర. దాని దెబ్బకు యూట్యూబ

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (09:56 IST)
రెండున్నర నిమిషాల వీడియో ట్రైలర్ చూడటానికి వేలమంది జనం థియటర్లకు పరుగు తీశారు. ఆన్‌లైన్ వెర్షన్ చూడటానికి తొలిరోజే కోటిన్నరమందికి కీబోర్డుపై వేళ్లు టకటకలాడించారు. ఇది సమకాలీన చలనచిత్ర చరిత్రపై రాజమౌళి చిత్రించిన బాహుబలియన్ ముద్ర. దాని దెబ్బకు యూట్యూబ్ రికార్డు బద్దలైంది. దర్శకుడి మాటల్లోనే చెప్పాలంటే తొలి గంటలో తెలుగు వీడియో ట్రైలర్‌ని పది లక్షలమంది చూసేశారు. గురువారం రాత్రికి 1కోటీ 40 లక్షలమంది జుర్రేశారు. ఇది జియో సిమ్ తీసుకువచ్చిన స్మార్ట్ ఫోన్ మహత్యమా లేక సినిమాపై కోట్లమంది పెట్టుకున్న వెర్రా తెలీదు కానీ మెగాస్టార్లు, పవర్ స్టార్లు, నటరత్నలూ, ఆ స్టార్లూ, ఈ స్టార్లూ అందరి రికార్డులూ బొక్క బొర్లపడ్డాయనేది జనం మాట.
 
తెలంగాణలో అయితే గురువార్ ఉదయం 9 గంటలకే  సింగిల్ స్క్రీన్‌లపై బాహుబలి ది కన్‌క్లూజన్ వీడీయో ట్రైలర్‌ను చూడటానికి జనం పొటెత్తారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్సన్ 35 ఎంఎం థియేటర్ వద్ద వందలాది జనం గుమికూడారు. తెలంగాణలో 41 థియేటర్లలో బాహుబలి 2 వీడీయో ట్రైలర్ విడుదలైంది. ప్రతిచోటా జనమే జనం. 
 
నగరంలోని ఒక ధియేటర్లో బాహుబలి 2 వీడియో ట్రైలర్ చూసిన వంశీ అనే విద్యార్థి మాట్లాడుతూ, ఒక కొత్త సినిమాను తొలి రోజే చూసినంత ఫీలింగ్ కలుగుతోందని అబ్బురపడుతూ చెప్పాడు. థియేటర్లో ట్రయిలర్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్రం విడుదలైన రోజే ఈ సినిమాను చూడగలనని భావిస్తున్నా అన్నాడు. 
 
భాహుబలి 2 గురించి గత సంవత్సన్నర కాలంగా సోషల్ మీడియాలో వస్తున్న అంచనాలు, ఊహలు గురించి తానేమీ కలవరపడటం లేదని చిత్ర దర్శకుడు రాజమౌళి చెప్పారు. రెండో భాగంలో ప్రేక్షకులు మరింత నాయకీయతను, కనువిందు చేసే యాక్షన్ దృశ్యాలను చూస్తారని చెప్పారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments