Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్స్ ఉత్సవంలో బాహుబలి: జర్మనీలో ఫట్ అయిన జక్కన్న సినిమా

Webdunia
మంగళవారం, 10 మే 2016 (10:31 IST)
ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లలో అదరగొట్టిన బాహుబలి సినిమాను కేన్స్‌లోని మార్షెడూ ఫిలిమ్ వేదికపై ప్రదర్శించనున్నారు. ఇంకా జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాను ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించిన నేపథ్యంలో.. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక విలువలపై వెరైటీ సంస్థ, ఏషియ‌న్ బ్యూరో చీఫ్ ప్యాట్రిక్ ఆధ్వ‌ర్యంలో చర్చ సాగనుంది. 
 
మే 16న జరిగే ఈ చర్చకు హాజరు కావాలని చిత్ర దర్శకులు రాజమౌళితో పాటు నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌, చిత్రం కోసం పని చేసిన రేడియాన్ టెక్నాలజీ గ్రూప్ సీనియ‌ర్‌ వైస్ ప్రెసిడెంట్ రాజా కోడూరిల‌కు ఆహ్వానం అందింది. ఈ చర్చకు అనంతరం కేన్స్‌లోని మార్షెడూ ఫిలిమ్ వేదికపై బాహుబలి సినిమాను ప్రదర్శించనున్నారు. చ‌ర్చ సంద‌ర్భంగా బాహుబ‌లి చిత్రానికి వాడిన టెక్నాల‌జీని రాజ‌మౌళి వివ‌రించ‌నున్నారు.
 
ఇకపోతే అంతర్జాతీయ భాషల్లో అనువాదం చేయించి.. రిలీజైన బాహుబలి చిత్రానికి కొన్ని భాషల్లో మంచి స్పందన వచ్చినా.. జర్మనీలో మాత్రం జక్కన్న సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని జర్మనీలో 30 స్క్రీన్లలో బాహుబలిని రిలీజ్ చేశారు. అయితే జర్మనీలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. బాహుబలి'తో పాటు బాలీవుడ్ మూవీ 'బాజీ రావు మస్తానీ' మూవీ కూడా జర్మనీలో నష్టాలనే మిగిల్చడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును రాజకీయం చేయొద్దు.. చంద్రబాబు వార్నింగ్

Etala: నా ఫోన్‌ను బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసింది.. ఈటెల రాజేందర్ ఫైర్

తెలంగాణ వాసి రాకేష్ ఆర్నెకి మిస్టర్ ఇండియా 2025 టైటిల్

టూరిస్ట్ సైట్స్ చూపిస్తానని నమ్మించి.. ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం..

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments