Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారతాన్ని ఎనిమిదేళ్ల తర్వాత తీస్తా.. నాలో సెల్ఫ్ డౌట్ ఉంది: రాజమౌళి

మహాభారతం తీయడమే తన కల అంటూ గతంలో చెప్పుకొచ్చిన బాహుబలి మేకర్ రాజమౌళి.. మహాభారతాన్ని తెరకెక్కించే విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. మహాభారతం తీయాలంటే సాంకేతికంగా అన్ని విధాలా హ్యాండిల్ చేయగలనా

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (12:36 IST)
మహాభారతం తీయడమే తన కల అంటూ గతంలో చెప్పుకొచ్చిన బాహుబలి మేకర్ రాజమౌళి.. మహాభారతాన్ని తెరకెక్కించే విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. మహాభారతం తీయాలంటే సాంకేతికంగా అన్ని విధాలా హ్యాండిల్ చేయగలనా అనే భయం తనకు వుందని ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పారు.

మహాభారతం తీయాలనే తపన ఉన్నా అందుకు తన అనుభవం చాలదని, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని రాజమౌళి చెప్పుకొచ్చారు. మహాభారతాన్ని తెరకెక్కించడం పెద్ద ఛాలెంజ్ అని అంటున్నారు.
 
మహాభారతం తీయాలంటే సమయంలో కావాలి. ఇంకా అంత పెద్ద ప్రాజెక్టు తీసే సత్తా తనలో ఉందా అనే సెల్ఫ్ డౌట్‌లో తనలో ఉందన్నారు. అయితే కచ్చితంగా ఎనిమిదేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తానని రాజమౌళి అనడంతో దీనిపై మరో సారి ఆసక్తికర చర్చ నడుస్తుంది.
 
ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన రందమూళమ్ పుస్తకం ఆధారంగా కొత్త సినిమా రూపొందనుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మహాభారత్ ప్రాజెక్టును వీఏ శ్రీకుమార్ మీనన్‌ దర్శకత్వంలో నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భీముని పాత్రధారిగా మోహన్ లాల్ కనిపించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments