Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారతాన్ని ఎనిమిదేళ్ల తర్వాత తీస్తా.. నాలో సెల్ఫ్ డౌట్ ఉంది: రాజమౌళి

మహాభారతం తీయడమే తన కల అంటూ గతంలో చెప్పుకొచ్చిన బాహుబలి మేకర్ రాజమౌళి.. మహాభారతాన్ని తెరకెక్కించే విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. మహాభారతం తీయాలంటే సాంకేతికంగా అన్ని విధాలా హ్యాండిల్ చేయగలనా

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (12:36 IST)
మహాభారతం తీయడమే తన కల అంటూ గతంలో చెప్పుకొచ్చిన బాహుబలి మేకర్ రాజమౌళి.. మహాభారతాన్ని తెరకెక్కించే విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. మహాభారతం తీయాలంటే సాంకేతికంగా అన్ని విధాలా హ్యాండిల్ చేయగలనా అనే భయం తనకు వుందని ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పారు.

మహాభారతం తీయాలనే తపన ఉన్నా అందుకు తన అనుభవం చాలదని, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని రాజమౌళి చెప్పుకొచ్చారు. మహాభారతాన్ని తెరకెక్కించడం పెద్ద ఛాలెంజ్ అని అంటున్నారు.
 
మహాభారతం తీయాలంటే సమయంలో కావాలి. ఇంకా అంత పెద్ద ప్రాజెక్టు తీసే సత్తా తనలో ఉందా అనే సెల్ఫ్ డౌట్‌లో తనలో ఉందన్నారు. అయితే కచ్చితంగా ఎనిమిదేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తానని రాజమౌళి అనడంతో దీనిపై మరో సారి ఆసక్తికర చర్చ నడుస్తుంది.
 
ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన రందమూళమ్ పుస్తకం ఆధారంగా కొత్త సినిమా రూపొందనుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మహాభారత్ ప్రాజెక్టును వీఏ శ్రీకుమార్ మీనన్‌ దర్శకత్వంలో నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భీముని పాత్రధారిగా మోహన్ లాల్ కనిపించనున్నారు.

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments