Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో బాహుబలి టీం సందడి...

హైదరాబాద్, కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో బాహుబలి జట్టు సందడి చేసింది. రాజమౌళి దృశ్యకావ్యం బాహుబలి 2 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం తొలి ఆటను వీక్షించేందుకు బాహుబల

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (10:47 IST)
హైదరాబాద్, కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో బాహుబలి జట్టు సందడి చేసింది. రాజమౌళి దృశ్యకావ్యం బాహుబలి 2 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం తొలి ఆటను వీక్షించేందుకు బాహుబలి టీం ఈ థియేటర్‌కు వచ్చింది. దీంతో అభిమానుల ఆనందాన్ని హద్దేలేకుండా పోయింది. ముఖ్యంగా చిత్ర దర్శకుడు రాజమౌళితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. 
 
కాగా, గత రెండేళ్లుగా ఎప్పుడెప్పుగా అని ఎదురుచూసిన ‘బాహుబలి-2’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాహుబలి ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం కూకట్‌పల్లి లోని శ్రీ భ్రమరాంబ థియేటర్‌ వద్ద బాహుబలి బృందం సందడి చేసింది. 
 
దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ, హీరోయిన్‌ అనుష్క, కీరవాణి దంపతులు, ఇతర బృంద సభ్యులు థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. టిక్కెట్ల కోసం థియేటర్‌ వద్ద బారులు తీరిన ప్రేక్షకులు చిత్ర బృందాన్ని చూసి ఆనందానికి గురయ్యారు. కొందరు రాజమౌళి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments