Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో తల్లిగా నాగార్జున హీరోయిన్.. ఎవరు?

వెండితెరపై అలా కనిపించి.. ఇలా మాయమయ్యేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అయేషా జుల్కా. ప్రస్తుతం ఈమె రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదీ కూడా హీరోయిన్‌గా కాదు సుమా.. ఓ హీరోకు తల్లిగా. సాధారణంగా, చిత్రపరిశ్ర

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (13:23 IST)
వెండితెరపై అలా కనిపించి.. ఇలా మాయమయ్యేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అయేషా జుల్కా. ప్రస్తుతం ఈమె రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదీ కూడా హీరోయిన్‌గా కాదు సుమా.. ఓ హీరోకు తల్లిగా. సాధారణంగా, చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోలు అయితే వయసు మీదపడుతున్నా నటిస్తూనే ఉంటారు. వారికి సినీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ, హీరోయిన్ల విషయంలో అంతా రివర్స్. మూడు పదుల వయసు దాటగానే అవకాశాలు సన్నగిల్లిపోతాయి.
 
నలభైకి వచ్చే సరికి ప్రధాన పాత్రల స్థానంలో సైడ్ క్యారెక్టర్లు వస్తాయి. ముఖ్యంగా, అమ్మ, అక్క, అత్త వంటి పాత్రలకే పరిమితం కావాల్సి ఉంటుంది. కొన్నేళ్ళపాటు స్టార్ హీరోయిన్‌గా ఉండి చివరికి చిన్నచిన్న పాత్రలు చేయలేక పెళ్లి చేసుకుని స్థిరపడిపోతుంటారు. అలాంటి పరిస్థితి అయేషాకు లేకపోయినప్పటికీ.. ఆమెకు సరైన సినీ అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇపుడు రీఎంట్రీ ఇవ్వనున్నారు. 
 
నాగార్జున హీరోగా 1990లో వచ్చిన చిత్రం నేటి సిద్దార్ధ. ఈ చిత్రంలో 'ఓసి మనసా' అనే పాటలో నాగార్జునతో కలిసి స్టెప్పులు వేసిన భామ అయోషా జుల్కా. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించింది. ఇటు తెలుగుతో పాటు హిందీలో అమీర్ ఖాన్‌తో కొంతకాలం దుమ్ము రేపింది. 2010లో వచ్చిన 'అదా' సినిమా తర్వాత వెండితెర నుంచి దూరమైంది. అలా సుమారు దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 
 
ఎనిమిదేళ్ల తరువాత ఇప్పుడు అనీల్ శర్మ దర్శకత్వం వహిస్తున్న 'జీనియస్' అనే బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నదట. హీరోయిన్‌గా మాత్రం కాదు. హీరోయిన్ తల్లిగా కనిపించబోతుంది. అదేసమయంలో మీడియాకు కనిపించిన అయోషా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నపుడు ఫిజిక్‌ను కాపాడుకుంటూ ఉండే తారలు.. ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాక ఎందుకు లావుగా మారిపోతారో అర్ధం కాదు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments