Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ పుత్రుడి కేసు.. కీలక సాక్షి గుండెపోటుతో మృతి

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (21:58 IST)
ముంబై శివారులో గత అక్టోబర్ నెలలో ఓ నౌకలో జరుగుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పట్టుబడటంతో ఈ కేసు సంచలనంగా మారింది.
 
కేసు విచారణ కూడా అంతే సంచలనం అయింది. విచారణ అధికారి సమీర్ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆతర్వాత ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ రావడం, కేసు విచారణ కొనసాగడం తెలిసిందే. అయితే ఇప్పుడీ కేసుకి సంబంధించి కీలక సాక్షి సెయిల్ మరణంతో కలకలం రేగింది. 
 
రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో ఎన్సీబీ అధికారులు, ఆర్యన్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవిని అప్పట్లో సాక్షిగా పరిగణించింది ఎన్సీబీ. ఆ డిటెక్టివ్ కి బాడీగార్డే ప్రభాకర్ సెయిల్. ప్రభాకర్ ని కూడా సాక్షిగా పేర్కొంది ఎన్సీబీ.
 
ఈ  డ్రగ్స్‌ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్‌ మృతి చెందారు. ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందినట్టు అతడి తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. 
 
ప్రభాకర్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారని, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించారని చెప్పారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments