నోట్ల రద్దు అతి క్రూరమైన చర్య : అరవింద్ సుబ్రమణ్యన్

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (13:39 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం అతి క్రూరమైన చర్యగా ప్రధానమంత్రి ఆర్థిక మాజీ సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న తొందరపాటు నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు.
 
తాను రాసిన ఓ పుస్తకంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో నోట్ల రద్దు అనేది అతిపెద్ద, క్రూర‌మైన, ఆర్థిక‌ప‌ర‌మైన షాక్ అని అర‌వింద్ ఆరోపించారు. నోట్ల ర‌ద్దు వ‌ల్లే ఆర్థిక ప్ర‌గ‌తి 6.8 శాతానికి ప‌డిపోయింద‌ని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
దేశంలో పెద్ద విలువ కలిగిన నోట్లను రద్దు చేయడం వల్ల చాలా రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయనీ, ఇవి ఇప్పటికీ కోలుకోలేక ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారు ప‌ద‌వికి గ‌త జూన్‌లో రాజీనామా చేసిన అర‌వింద్‌.. కేవ‌లం అవినీతిని త‌గ్గించేందుకే ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దును చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు అభివృద్ధి 8 శాతం ఉండేద‌ని, కానీ ఆ త‌ర్వాత అది 6.8 శాతానికి ప‌డిపోయింద‌న్నారు.
 
కాగా, గత 2016, నవంబ‌ర్ 8వ తేదీన ప్ర‌ధాని నరేంద్ర మోడీ.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ అంశంపై తాను రాసిన ఓ పుస్త‌కంలో వెల్ల‌డించారు. ఆఫ్ కౌన్సిల్‌- ద ఛాలెంజెస్ ఆఫ్ ద మోడీ-జైట్లీ ఎకాన‌మీ పేరుతో పుస్త‌కాన్ని ప్ర‌చురించ‌నున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wedding: భాంగ్రా నృత్యం చేస్తూ వధువు మృతి.. పెళ్లికి కొన్ని గంటలకు ముందే...?

కాలేజీ స్టూడెంట్‌పై యాసిడ్ దాడి.. చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు..

First State Butterfly: రాష్ట్ర నీలి సీతాకోకచిలుకగా తిరుమల లిమ్నియాస్..

తాడుతో భర్త మెడను బిగించి ఊపిరాడకుండా చేసింది.. ఆపై కర్రతో తలపై కొట్టి చంపేసింది..

తిరుమలలో భారీ వర్షాలు.. పూర్తిగా నిండిపోయిన పాపవినాశనం, గోగర్భం జలాశయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments