Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెరైపైకి రాధేశ్యామ్ : టిక్కెట్ ధరల పెంపునకు సమ్మతం

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (07:20 IST)
ప్రభాస్ - పూజా హెగ్డే నటించిన ప్రేమకావ్యం "రాధేశ్యామ్". రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. అయితే, ఈ చిత్రం ఐదో ఆటను వేసుకునేందుకు, టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 
ఇపుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. సినిమా బడ్జెట్ రూ.170 కోట్లు దాటినందున ప్రీమియం టిక్కెట్ ధరపై రూ.25 పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయం చివరి నిమిషంలో వెల్లడించింది. ప్రీమియం టిక్కెట్ ధరను రూ.25 మేర పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, "రాధేశ్యామ్" నిర్మాణానికి రూ.170 కోట్లు దాటిపోయిందని, అందువల్ల టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వానికి చిత్రం బృందం విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిశీలించిన ఏపీ సర్కారు సానుకూలంగా స్పందించింది. కాగా, హీరో, దర్శకుల రెమ్యునరేషన్ కాకుండా చిత్ర బడ్జట్ రూ.100 కోట్లు దాటితే టిక్కెట్ల ధరల పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments