Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెరైపైకి రాధేశ్యామ్ : టిక్కెట్ ధరల పెంపునకు సమ్మతం

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (07:20 IST)
ప్రభాస్ - పూజా హెగ్డే నటించిన ప్రేమకావ్యం "రాధేశ్యామ్". రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. అయితే, ఈ చిత్రం ఐదో ఆటను వేసుకునేందుకు, టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 
ఇపుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. సినిమా బడ్జెట్ రూ.170 కోట్లు దాటినందున ప్రీమియం టిక్కెట్ ధరపై రూ.25 పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయం చివరి నిమిషంలో వెల్లడించింది. ప్రీమియం టిక్కెట్ ధరను రూ.25 మేర పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, "రాధేశ్యామ్" నిర్మాణానికి రూ.170 కోట్లు దాటిపోయిందని, అందువల్ల టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వానికి చిత్రం బృందం విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిశీలించిన ఏపీ సర్కారు సానుకూలంగా స్పందించింది. కాగా, హీరో, దర్శకుల రెమ్యునరేషన్ కాకుండా చిత్ర బడ్జట్ రూ.100 కోట్లు దాటితే టిక్కెట్ల ధరల పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments