Webdunia - Bharat's app for daily news and videos

Install App

12న సామర్లకోటలో పర్యటించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (11:17 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో పర్యటించనున్నారు. ఇక్కడ నిర్మించిన జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
ఇందుకోసం ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరి సామర్లకోటకు చేరుకుంటారు. అక్కడ జరిగే జగన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని, అక్కడ నుంచి తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేశ్ - బాబుకు మంచి రోజులేనా?  
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలిశారు. బుధవారం రాత్రి అమిత్ షా నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు అర గంట పాటు ఆయనతో నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి, కిషన్ రెడ్డిలు ఉన్నారు. 
 
ఆ తర్వాత నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, జగన్ కక్షసాధింపు చర్యలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, విచారణ పేరుతో తమను వేధిస్తున్న తీరు, జగన్ కక్ష సాధింపు తీరును హోం మంత్రికి వివరించినట్టు చెప్పారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిలను కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు, తనపై పెట్టిన కేసుల గురించి వాకబు చేశారని వెల్లడించారు. 
 
ముఖ్యంగా, జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు ట్రైల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో వవిధ కేసులకు సంబంధించిన విచారణ గురించి హోం మంత్రికి వివరించానని తెలిపారు. 73 యేళ్ల వయస్సున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం ఏమాత్రం మంచిదికాదని అమిత్ షా అన్నారని తెలిపారు. అలాగే, తన తండ్రి ఆరోగ్యం గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారని చెప్పారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నట్టు అమిత్ షా అన్నారని లోకేశ్ అన్నారు. ఈ సమావేశం తర్వాత అరెస్టయి జైల్లో ఉన్న చంద్రబాబుకు మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments