Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టిన త‌మ్మారెడ్డి..! ఏంటా నిర్ణ‌యం..?

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (15:02 IST)
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్ర‌జా సంక్షేమ‌మే త‌న ల‌క్ష్యంగా దూసుకెళుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటిదాకా ప్రజా సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఇదే ఊపులో జగన్ తీసుకున్న ఒక నిర్ణయంపై చుట్టూ పక్కల నుండి విమర్శలు వస్తున్నాయి. ఇంత‌కీ ఏంటా నిర్ణ‌యం అంటారా..?
 
పిల్లలను స్కూల్‌కి పంపే ప్రతి తల్లికి 15 వేలు ఇస్తానని చెప్పాడు. అయితే ఈ పథకం అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపే తల్లులకు మాత్రమే 15 వేలు ఇస్తే బాగుంటుందని, అలా కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు పంపే తల్లులకు కూడా ఇస్తే అది మొదటికే మోసం వస్తుందని, దాని వలన ప్రభుత్వ పాఠశాలలు మరింత హీనస్థితికి చేరుతాయనే వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
 
ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా దీనిపై స్పందించారు. ఇంత‌కీ ఆయ‌న వాద‌న ఏంటంటే.... బాగా ఒళ్ళు బలిసిన వాళ్లే తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లే ప్రభుత్వ పాఠశాలలకు వస్తారు. కాబట్టి ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థి తల్లులకు ఇస్తే బాగుంటుంది. అవసరం అయితే 15 వేలుని పెంచి 20 వేలు ఇచ్చినా ఇంకా బాగుంటుంది. అదేవిధంగా గతంలో ప్రవేశపెట్టిన స్కాలర్‌షిప్ లోని కొన్ని లొసుగుల వలన అది అక్రమాల బాట పట్టింది, దానిని గమనించి జగన్ ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందని ఆయ‌న చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments