Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్కపై మనసుపడిన చిరంజీవి.. 152వ చిత్రంలో...

మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ లేడీ మెగాస్టార్ అనుష్కల కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. అదీ కూడా పుష్కరకాలం (12 యేళ్ల) తర్వాత వీరిద్దరు నటించి పూర్తిస్థాయి చిత్రం రానుంది. ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ చిత

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (13:08 IST)
మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ లేడీ మెగాస్టార్ అనుష్కల కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. అదీ కూడా పుష్కరకాలం (12 యేళ్ల) తర్వాత. ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈయన చిత్ర కథను తయారు చేసే పనిలో నిమగ్నమైవున్నారు.
 
నిజానికి తెలుగు చిత్రపరిశ్రమలో అనుష్క హీరోయిన్‌గా అరంగేట్రం చేసి 13 యేళ్లు. ఈ మధ్యకాలంలో తెలుగులోని అగ్రహీరోలందరితో నటించింది. వీరిలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, యువ కథానాయకులు మహేశ్‌బాబు, ప్రభాస్‌, గోపీచంద్‌ తదితరులు ఉన్నారు. కానీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేదా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలతో మాత్రం ఆమె నటించలేదు. అలాంటి అవకాశం కూడా అనుష్కకు రాలేదని చెప్పొచ్చు. 
 
అయితే, ఆ మధ్య చిరంజీవి నటించిన చిత్రం "స్టాలిన్‌"లో మాత్రం అనుష్క ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. అంతేకానీ, హీరోయిన్‌గా మాత్రం ఇప్పటివరకు నటించలేదు. ఈ 'స్టాలిన్' చిత్రం విడుదలై పన్నెండేళ్లు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అనుష్కకు చిరంజీవికి జోడీగా నటించే అవకాశం వచ్చిందని ఫిల్మ్‌నగర్‌ టాక్.
 
ప్రస్తుతం చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమా చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తికాగానే, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అందులో ఆయనకు జోడీగా అనుష్క నటించనున్నారట.
 
ఎందుకంటే అనుష్క నటించిన 'భాగమతి' చిత్రం తర్వాత ఆమె మరో చిత్రానికి సంతకం చేయలేదు. చిరు సినిమాకి సంతకం చేస్తే... కొరటాల దర్శకత్వంలో అనుష్కకు రెండో సినిమా అవుతుంది. చిరంజీవి సరసన కథానాయికగా తొలి సినిమా అవుతుంది. ప్రభాస్ - కొరటాల కాంబినేషన్‍‌‌లో వచ్చిన 'మిర్చి'లో అనుష్క నటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

13-year-old girl kills 4-year-old boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

Vada Share : వడ షేర్ చేసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments