Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలను కించపరిచే సినిమా యానిమల్ అంటూ విమర్శలు

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (12:34 IST)
animal latest poster
రణబీర్ కపూర్, రష్మిక మందన్నా నటించిన యానిమల్ సినిమా సునామిలా కలెక్షన్లు రాబడుతుంది. రజనీకాంత్ జైలర్ ను మించిన కలెక్షన్లు విశ్వవ్యాప్తంగా వస్తున్నాయి.  డిసెంబర్ 1 న విడుదలైన యానిమల్ కు ఇప్పటికీ 500 కోట్లకు చేరిందని చిత్ర యూనిట్ తెలియజేస్తుంది. ఇంత వసూళ్ళు రాబడుతుంది కేవలం యువతీ యువకుల ఆదరణ వల్లే. అందుకే పలువురు మేథావులు ఈ సినిమాను చూసి విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగులోనూ పలువురు సెలబ్రిటీలు విమర్శలు గుప్పించినా కథానాయకుడు నాని మాత్రం సూపర్ మూవీ అంటూ కితాబిచ్చాడు.
 
కాగా, ఈ సినిమాపై టీమ్ ఇండియా క్రికెటర్ జయదేవ్ కూడా విమర్శలు గుప్పించారు. తాజాగా బాలీవుడ్ లో లగే రహో మున్నా భాయ్ చిత్రంలోని "బందే మే థా దమ్... గీతాన్ని రాసిన గాయకుడు, రచయిత, సహాయ దర్శకుడు, నటుడు స్వానంద్ కిర్కిరే తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తన సోషల్ మీడియాలో మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.
 
ఈ సినిమా చూసి మహిళలు రష్మిక మందన్న వచ్చినప్పుడల్లా క్లాప్స్ కొడుతుంటే, మహిళలపై జాలేసింది. మీ కోసం కొత్త వ్యక్తి వచ్చాడు. అలాంటి వారితో మీకు గౌరవం రాదు. ఇకపై ఎవరూ ఇవ్వరు. మిమ్మల్ని అణచివేత వేసే వ్యక్తి గురించి మీరు గర్వపడుతున్నారు. థియేటర్ లో రష్మికను చూసి మహిళలు చప్పట్లు కొడుతుంటే నిరాశతో బాధతో వచ్చేసా అంటూ ట్వీట్ చేశాడు.
 
దీనిని చూశాక యామినల్ యూనిట్ రిప్లయి ఇచ్చింది. మీ మోకాళ్ళను మీ కాలి ముందు పడనివ్వకండి. మీ భుజం పాదాలు వేరువేరుగా వుంచండి .అప్పుడు బ్యాలెన్స్ గా నిలబడగలరు. అంటూ చిత్రమైన కౌంటర్ ఇచ్చింది. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఇతను తెలంగాణాకు చెందిన ఎన్.ఆర్.ఐ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?

ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా సందర్శించిన ప్రధాని

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి (video)

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments