Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాములకు రాజకీయాలు అవసరమా?: యాంకర్ సుమ సూటి ప్రశ్న

స్వాములకు రాజకీయాలు అవసరమా? అంటూ పరిపూర్ణానంద స్వామిని టీవీ యాంకర్ సూటిగా ప్రశ్నించింది. ఈ స్వామి ఇటీవల ఓ చానల్‌ను ప్రారంభించారు. భారతీయత గురించి ఆ చానల్‌లో వివరిస్తుంటారు. హిందూ ధర్మాన్ని బోధిస్తున్న

Webdunia
ఆదివారం, 28 మే 2017 (17:52 IST)
స్వాములకు రాజకీయాలు అవసరమా? అంటూ పరిపూర్ణానంద స్వామిని టీవీ యాంకర్ సూటిగా ప్రశ్నించింది. ఈ స్వామి ఇటీవల ఓ చానల్‌ను ప్రారంభించారు. భారతీయత గురించి ఆ చానల్‌లో వివరిస్తుంటారు. హిందూ ధర్మాన్ని బోధిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో సెలబ్రిటీని ఆహ్వానించి, వాళ్ల ప్రశ్నలకు స్వామీజీ సమాధాలిస్తారు. ఇలా ఒక ఎపిసోడ్‌కు యాంకర్ సుమ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా సుమ అడిగిన ప్రశ్నలకు పరిపూర్ణానంద స్వామి సమాధానమిస్తూ.. 'అసలు బేసిక్‌గా స్వామీజీలకు రాజకీయాలెందుకు? అనేవాళ్లు ఎవరంటే.. రాజకీయనాయకులే. స్వామీజీలు రాజకీయాల్లోకి వస్తే తమ పని అయిపోతుందని భయపడుతున్నారేమో! బేసిక్‌గా రాజకీయనాయకులకు భార్య, పిల్లలు, వాళ్ల మనవళ్లు, వాళ్ల తల్లిదండ్రులు, వాళ్లకున్న వ్యాపారమో, ఉద్యోగమో.. ఇంకొకటో.. ఇవన్నీ చక్కబెట్టుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలంటే చాలా కష్టంమన్నారు.
 
ఇపుడు ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. మోడీ గారు ఉన్నారు.. ఆయనెవరు? సన్యాసి. ఈ రోజు మోడీగారు రాజకీయాల నుంచి బయటకు వచ్చారనుకోండి.. ఆయనకు ఒక ఇల్లు లేదు. ఆయనకు భార్య, పిల్లలు లేరు. ఆయనకు ఏవీ లేవు. ఆయన ఏం చేస్తారో తెల్సా? నేను చెప్తున్నాను మీకు.. ఆయన రాజకీయాల్లోంచి బయటకు వచ్చారనుకోండి హాయిగా.. మళ్లీ భుజాన ఒక బ్యాగ్ వేసుకుంటారు.. కుదిరితే ఫుల్‌టైమర్‌గా మళ్లీ ఆర్ఎస్ఎస్‌లోకి వెళ్లి సంఘ ప్రచారం చేసుకుంటారు. లేదా ఆయను కాషాయం ఇష్టమనుకోండి శుభ్రంగా వెళ్లి రుషికేష్‌లో తపస్సు చేసుకుంటారు.
 
అలా ఏ రాజకీయనాయకుడైనా చేయగలడా?.. చేయలేరు. ఎందుకంటే వాళ్లకు వెనకాల చాలా బాధ్యతలున్నాయి. నా అభిప్రాయం ప్రకారం రాజకీయాల్లోకి ఎవరైనా రావాలంటే.. ఏ బాదరబందీ లేనివాడు వస్తే ఖచ్చితంగా ఎంతో కొంత చేస్తాడు. ఏదో ఒక ప్రక్షాళన చేయాలనే ఫీలింగ్ కలుగుతుంది' అని పరిపూర్ణానందం చెప్పుకొచ్చారు. అలాగే, పశువుల విక్రయాలపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని ఆయన సమర్థించారు. కేంద్రం చాలా మంచి నిర్ణయం తీసుకుందని, దీనివల్ల దేశంలో పశుసంపద పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments