Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు బిడ్డల తల్లినైతే ఐటమ్ సాంగ్ చేయకూడదా?: అనసూయ

ఇటీవల ఓ పిల్లాడి ఫోనును నేలకేసి కొట్టి వివాదంలో చిక్కుకున్న బుల్లితెర యాంకర్‌, యాక్టర్ రంగమ్మత్త అదేనండి అనసూయ.. మళ్లీ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. రంగస్థలం సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపా

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (16:25 IST)
ఇటీవల ఓ పిల్లాడి ఫోనును నేలకేసి కొట్టి వివాదంలో చిక్కుకున్న బుల్లితెర యాంకర్‌, యాక్టర్ రంగమ్మత్త అదేనండి అనసూయ.. మళ్లీ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. రంగస్థలం సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. తాజాగా తనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయని చెప్పింది.


ఓవైపు యాంకర్‌‌లా టీవీల్లో కనిపించడం సరేకానీ.. మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేయడం ఎందుకని చాలామంది తనను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారని చెప్పింది. 
 
ఇద్దరు బిడ్డల తల్లివి అయినా ఈ ఐటమ్ సాంగ్స్ నీకు అవసరమా అంటూ అడుగుతున్నారని అనసూయ తెలిపింది. ఈ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించింది. ఇద్దరు బిడ్డల తల్లినైతే ఏంటి? బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు పెళ్లి కావడమే కాకుండా పిల్లలు పుట్టాక కూడా రాణిస్తున్నారని గుర్తు చేసింది. 
 
ఒకప్పటి అగ్ర తారలైన భానుమతిగారు, సావిత్రిగారు పెళ్లయిన తర్వాత కూడా కెరీర్‌లో అద్భుతంగా రాణించారు. అప్పుడులేని విమర్శలు ఇప్పుడు ఎందుకు? వైవిధ్యభరితమైన పాత్రలు వచ్చినపుడు చేయడంలో తప్పు లేదంటూ అనసూయ తెలిపింది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments