Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్డుపడిన మాంసపు ముక్క... గాల్లో కలిసిన ప్రాణాలు...

కొన్ని మరణాలు వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి మరణం ఒకటి అనంతపురం జిల్లాలో సంభవించింది. మాంసపు ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రూ

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (15:06 IST)
కొన్ని మరణాలు వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి మరణం ఒకటి అనంతపురం జిల్లాలో సంభవించింది. మాంసపు ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రూరల్ మండలంలో ఈ ఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఆవులదట్ల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా రామాంజనేయులు (35) అనే వ్యక్తి పని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూలీలంతా భోజనానికి వచ్చారు. వారితో పాటు ఈయన కూడా ఇంటికి వచ్చి భోజనం చేయసాగాడు. 
 
అపుడు ఓ మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన విలవిల్లాడి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆవులదట్ల ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. 
 
విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏ పీవో అప్పస్వామినాయుడు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సకాలంలో వైద్యం అంది ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడు రా మాంజినేయులుకు భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments