Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్డుపడిన మాంసపు ముక్క... గాల్లో కలిసిన ప్రాణాలు...

కొన్ని మరణాలు వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి మరణం ఒకటి అనంతపురం జిల్లాలో సంభవించింది. మాంసపు ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రూ

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (15:06 IST)
కొన్ని మరణాలు వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి మరణం ఒకటి అనంతపురం జిల్లాలో సంభవించింది. మాంసపు ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రూరల్ మండలంలో ఈ ఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఆవులదట్ల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా రామాంజనేయులు (35) అనే వ్యక్తి పని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూలీలంతా భోజనానికి వచ్చారు. వారితో పాటు ఈయన కూడా ఇంటికి వచ్చి భోజనం చేయసాగాడు. 
 
అపుడు ఓ మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన విలవిల్లాడి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆవులదట్ల ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. 
 
విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏ పీవో అప్పస్వామినాయుడు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సకాలంలో వైద్యం అంది ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడు రా మాంజినేయులుకు భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లాడుతానని తరచూ నాపై అత్యాచారం చేసాడు: కన్నడ నటుడు మనుపై సహ నటి ఫిర్యాదు

మీ పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా? సజ్జలపై సుప్రీం ఫైర్

Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కాదు.. రాజు బిరుదు ఇవ్వాల్సింది : ఇమ్రాన్ ఖాన్

Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్‌గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments