Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటారు.. నోట్ల నిషేధం వ్యతిరేకించే వారిపై అనంత శ్రీరాం వ్యంగ్య కవిత (వీడియో)

దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అనేక మంది తప్పుబడుతున్నారు. వీరిలో ఆర్థికవేత్తలు, నిపుణులు కూడా ఉన్నారు. నోట్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (16:15 IST)
దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అనేక మంది తప్పుబడుతున్నారు. వీరిలో ఆర్థికవేత్తలు, నిపుణులు కూడా ఉన్నారు. నోట్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న వారినుద్దేశించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన యువ రచయిత అనంత శ్రీరామ్ ఓ వ్యంగ్య కవితను రాశాడు. "భారతీయులమండి" అని టైటిల్‌తో ఈ కవిత సాగుతుంది. ఈ కవితను తానే చదువుతూ.. ఉన్న వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో ఆయన పెట్టాడు. ప్రస్తుతం ఈ కవిత సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ఈ కవితలో "ఎవడో వచ్చి ఏదో చేస్తాడని ఎదురు చూస్తుంటాం.. నిజంగానే ఎవడైనా ఏదైనా చేస్తుంటే మాత్రం ఎద్దేవా చేస్తాం... భారతీయులమండి.. మేం భారతీయులం" అని వ్యంగ్యంగా విమర్శించాడు. 'మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం.. మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదంటాం' అంటూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దుయ్యబట్టాడు. ఆయనేమన్నారో మీరూ వినండి.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments