Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దొరసాని' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది!

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (13:15 IST)
అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన 'దొరసాని' జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, రాజశేఖర్ జీవితల కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతూ... మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణ అనంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్‌కి సిద్దం అవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు.
 
80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా... టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. 'నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే' పాట దొరసానిపై అంచనాలను పెంచాయి. మరోపాట 'కలవరమై.. కలవరమై' ఈనెల 24న రిలీజ్ కానుంది. కల్మషం లేని ప్రేమకథగా తెరకెక్కిన ‘దొరసాని’ ప్రేమకథలలో ప్రత్యేకస్థానంలో నిలుస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈ దొరసాని వారి ఆశలను ఎంత మేరకు నెరవేర్చుతుందో వేచి చూద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments