ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ఇప్పటికే పలువురు తారలు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రేమిస్తే భరత్, సునీల్, పాలడబ్బా తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో ప్రముఖ తమిళ నటి అమ్ము అభిరామ్ చేరారు.
తమిళ చిత్రలు రాట్సానన్, అసురన్ చిత్రంలో ఈ ఈమె తన అభినయంతో మంచి పేరు తెచ్చుకున్నారు. గోలీసోడా ఫ్రాంఛైజీగా ప్రముఖ దర్శకుడు, కెమెరామెన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. గతంలో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో వచ్చిన గోలీసోడా వెబ్ సీరిస్లో కూడా అమ్ము అభిరామి మంచి పాత్రను చేశారు. ఇది ఈ ఇద్దరి కలయికలో రెండో చిత్రం. ఈ చిత్రంలో అమ్ము అభిరామి పాత్ర ఎంతో పవర్ఫుల్గా, ఎమోషనల్గా కూడా ఉంటుందని, ఆమె అభినయం, పాత్ర చిత్రానికి ప్లస్ అవుతుందని, ఆమెలోని పలు కొత్తకోణాలు ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నామని అంటున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్.