Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. అమితాబ్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (10:13 IST)
కరోనా మహమ్మారి దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కరోనా అంటేనే జనం వణికిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆయన తనయుడు అభిషేక్, కోడలు ఐష్‌, మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అభిషేక్, అమితాబ్ నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఐష్‌, ఆరాధ్య ఇంటివద్దే జాగ్రతలు తీసుకుంటూ మందులు వాడుతున్నారు.
 
75 ఏళ్ళ అమితాబ్‌కి కాలేయ, ఉదర సంబంధిత వ్యాధులు ఉండగా, ఆయన ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బిగ్ బీ ప్రతి రోజు తన హెల్త్ అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. అమితాబ్ క్షేమంగా తిరిగి రావాలని మనదేశంలోనే కాదు విదేశానికి చెందిన అభిమానులు, ప్రముఖులు కూడా ప్రార్ధిస్తున్నారు. కొందరు యాగాలు చేస్తున్నారు. 
 
తనపై ఇంత ప్రేమని కురిపించడం చూసి బిగ్ బీ ఎమోషనల్ అవుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నమస్కరిస్తున్న ఫోటో ఒకటి పెట్టి పోస్ట్ పెట్టారు. ఇందులో మీ ప్రార్ధనలు, శుభాకాంక్షలకి నా ధన్యవాదాలు.. మీ కుండపోత ప్రేమకు మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అమితాబ్ కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments