Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైరసీ వీడియోలు అమ్మాను.. వంగవీటి ఆడియోకు నాగార్జున, అమితాబ్.. వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. తాను ఇంజినీరింగ్‌ ఫెయిల్‌ తర్వాత పైరసీ వీడియోలు అమ్మడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు.

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (12:29 IST)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. తాను ఇంజినీరింగ్‌ ఫెయిల్‌ తర్వాత పైరసీ వీడియోలు అమ్మడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ మెగా బీ అమితాబ్‌ బచ్చన్‌ 'ఆఖరి రాస్తా' సినిమా పైరసీ వీడియోలు కూడా అమ్మానని, ఇప్పుడు ఆయనతోనే 'సర్కార్‌ 3' తీస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌‌తో వర్మ ఇంతకుముందు సర్కార్‌, డర్నా జరూరీ హై, నిశ్శబ్ద్‌, ఆగ్, సర్కార్‌ రాజ్‌, రణ్‌, డిపార్ట్‌ మెంట్‌, టైమ్‌ మెషీన్‌ సినిమాలు తీశారు. 
 
కాగా, రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం 'వంగవీటి' ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌కి అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నెల 20న 'శివ టు వంగవీటి' పేరుతో హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్‌ నిర్వహించనున్నారు. వంగవీటి సినిమాపై హైప్ తీసుకురావడానికి వర్మ తెలివిగా తన సినిమా జర్నీ పేరుతో.. బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోలతో ఒక కార్యక్రమం నిర్వహించి ‘వంగవీటి’ని మళ్లీ వార్తల్లో నిలపాలని ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్ జనం చెప్తున్నారు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments