Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్‌ను అమిత్‌షా క‌ల‌వ‌బోతున్నారు

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (10:38 IST)
Prabhas, Amit Shah
ఇటీవ‌లే టాలీవుడ్ స్టార్ ఎన్‌.టి.ఆర్‌.ను హైద‌రాబాద్ వ‌చ్చి ప్ర‌త్యేకంగా క‌లిసిన బిజెపి అగ్ర నేత అమిత్ షా ఆ త‌ర్వాత హీరో నితిన్‌ను కూడా క‌లిశారు. ఇప్పుడు తాజాగా ప్ర‌భాస్‌ను క‌ల‌వ‌నున్నారు. అందుకోసం ప్ర‌భాస్ రేపు అన‌గా 16వ తేదీన షూటింగ్‌ను విర‌మించుకుని హైద‌రాబాద్‌లో ఇంటి వ‌ద్ద‌నే వుండ‌నున్నారు. ముఖ్యంగా కృష్ణంరాజు మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న్ను క‌ల‌వాల‌నుకున్నా సాధ్య‌ప‌డ‌లేదు. అందుకే ప్ర‌త్యేకంగా రేపు అనగా 16వ తేదీ శుక్ర‌వారంనాడు క‌ల‌వ‌నున్న‌ట్లు ప్ర‌భాస్‌కు సందేశాన్ని అంద‌జేశారు.
 
బిజెపి పార్టీకి సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో భాగంగా హైద‌రాబాద్ వ‌స్తున్న అమిత్ షా ప్ర‌త్యేకంగా టైం తీసుకుని ప్ర‌భాస్‌ను క‌ల‌సి ప‌రామ‌ర్శించ‌నున్నారు. కృష్ణంరాజు ఇప్ప‌టికే బిజెపి పార్టీ కార్య‌క‌ర్త‌గా వున్నారు. మ‌ధ్య‌లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్ళారు. అది చారిత్రాత్మ‌క త‌ప్పిదంగా ఆయ‌న ఆ త‌ర్వాత వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత బిజెపిలో కొన‌సాగారు కృష్ణంరాజుగారు.  రేపు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా, అనంతరం కృష్ణంరాజు గారి ఇంటికి వెళ్లి ఆయన సతీమణి శ్యామల గారిని, హీరో ప్రభాస్ ని కలిసి నివాళులు అర్పించనున్నట్లు ప్ర‌క‌ట‌న వెల‌వ‌డింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments