Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబాలిని బీజేపీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందా? రజనీకాంత్ ఒప్పుకుంటారా?

కబాలి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీలో చేరుతారని జోరుగా చర్చ సాగుతోంది. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రజనీకి రాజకీయాలొద్దని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్ రాజకీయాల వైపు ద

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (12:17 IST)
కబాలి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీలో చేరుతారని జోరుగా చర్చ సాగుతోంది. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రజనీకి రాజకీయాలొద్దని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్ రాజకీయాల వైపు దృష్టి పెట్టకూడదనుకుంటున్నట్లు కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఇప్పటికే తమిళ రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్న వేళ... తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంటోంది. 
 
ప్రస్తుత అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ సన్నద్ధమైనట్లు సమాచారం. రజనీతో ఆరెస్సెస్ నేత గురుమూర్తి ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడారని చెబుతున్నారు. అయితే, రజనీ నుంచి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 
ఏదేమైనప్పటికీ, ఈ వార్త తమిళనాడులో సంచలనంగా మారింది. రాజకీయపరంగా మరింత వేడిని పెంచుతోంది. ఇదిలా ఉంచితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని గురుమూర్తి శుక్రవారమే ప్రకటించారు. రజనీకాంత్ బీజేపీలో టచ్ ఉన్నారని, వీరద్దరి మధ్య ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తి సయోధ్య కుదురుస్తున్నారంటూ మీడియో తెగ హడావిడి చేసింది. 
 
రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలన్నీ ఉత్తుత్తిదేనని.. రజనీకాంత్‌ కొత్త పార్టీ ఏర్పాటు అనేది అవాస్తం అని గురుమూర్తి స్పష్టం చేశారు. రజనీకాంత్ బీజేపీతో చర్చలు జరుపుతున్నారంటూ వస్తున్న ప్రచారమంతా ఓ కట్టుకథ, అభూత కల్పన అని కొట్టిపారేశారు. మీడియాలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రసారం చేస్తారో అర్థం కావడం లేదని ట్వీట్‌ చేసిన రజనీకాంత్ ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments