Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల వైకుంఠపురంలో కొత్త రికార్డ్.. టీఆర్పీ రేటింగ్ అదిరిపోయిందిగా..!

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (12:50 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా,  సుశాంత్‌, టబు ప్రధాన పాత్రల కనిపించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. నాన్ బాహుబలి చిత్రంగా అనేక రికార్డులు క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో చిత్రం గత వారం ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం చేయబడింది. 
 
ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తెలుగు చిత్రాలలో ఇప్పటివరకు ఇదే అత్యధికం అంటున్నారు. లాక్‌డౌన్ వలన ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఈ సినిమాని చాలామంది వీక్షించినట్టు తెలుస్తుంది. కాగా, సినిమాలోని ప్రతి సాంగ్ కూడా దేశ వ్యాప్తంగానే కాక విదేశీ ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
 
ఇదిలా ఉంటే.. అల వైకుంఠపురములో అంటూ సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డుల పంట పండిస్తోంది. నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర ఆల్బమ్ వంద కోట్ల వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments