Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా పేరు సూర్య'గా అల్లు అర్జున్ ... మే 4న ప్రేక్షకుల ముందుకు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈచిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (10:17 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈచిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ పాటను కూడా పూర్తిచేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించి బన్నీ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఆడియో రిలీజ్ పెట్టుకుంటే బాగుంటుందని ఈ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే, ఆ రోజు వీలుపడుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత ఇంకా వీడలేదు. 
 
మరోవైపు, ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ ఎక్కడ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చిస్తున్నారు. భాగ్యనగరంలో ఈ ఫంక్షన్ జరిపితే రొటీన్‌గా ఉంటుందనీ అందువల్ల వైజాగ్‌లో జరుపుదామని అనుకుంటే .. ఇంతకుముందే అక్కడ 'రంగస్థలం' ఫంక్షన్ జరిపారు. అందువలన అల్లు అర్జున్ చిత్రం ఆడియో  వేడుకను 'తిరుపతి'లోగానీ .. కర్నూల్‌లోగాని జరపాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సంగతి పక్కనబెడితే చిత్రం మాత్రం మే 4వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments