Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బుట్టబొమ్మ' మాయలో నెటిజన్లు.. సోషల్ మీడియా షేక్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (12:08 IST)
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్. నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబులు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలోని ప్రతి పాటా సూపర్ హిట్టే. థమన్ సంగీత బాణీలు సమకూర్చాడు. ఈ చిత్రంలోని పాటలన్నీ యూత్‌ను ఓ ఊపు ఊపాయి. ముఖ్యంగా, బుట్టబొమ్మ, రాములో రాములా, సామజవరగమన పాటలు ఇండస్ట్రీలో పెను సంచలనమే రేపాయి. 
 
అయితే, 'బుట్టబొమ్మా' అనే ఫుల్ వీడియో సాంగ్‌ను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ పాట ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ పాట 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ సాంగ్, అరుదైన ఘనతను సాధించింది. 
 
అంటే 10 కోట్ల మంది ఈ పాటను వీక్షించారన్న మాట. ఈ పాటకి 1 మిలియన్ లైక్స్ లభించడం మరో విశేషం. స్వరకల్పన .. సాహిత్యం .. కొరియోగ్రఫీ .. ఆలాపన .. చిత్రీకరణ .. ఇలా అన్నీ కుదిరిన కారణంగానే ఈ సాంగ్ ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments