తగ్గేదేలే అంటోన్న అల్లు అర్జున్..

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (12:59 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్యూయార్క్ లో సందడి చేశారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన ఇండియా డే పరేడ్ కార్యక్రమానికి భార్య స్నేహారెడ్డి తో కలసి హాజరయ్యాడు. 
 
ఈ సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని చేత్తో పట్టుకుని రెపరెపలాండించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా 'గ్రాండ్ మార్షల్' అవార్డును ఇచ్చి అక్కడి వారు సత్కరించారు. తనకు గ్రాండ్ మార్షల్ అవార్డును ఇవ్వడం పట్ల అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపాడు.
 
సినిమా, వినోద ప్రపంచానికి అందించిన సేవలకు గాను ఈ గౌరవాన్ని అందించారు.  ఇక అల్లు అర్జున్ న్యూయార్క్ పర్యటనలో ప్రత్యేకత ఏమిటంటే.. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ను కలుసుకున్నాడు.
 
ఇద్దరూ కలసి పుష్ప మాదిరిగా తగ్గేదేలే అన్న సంకేతంగా గడ్డం కింద చేయి పెట్టుకుని ఫొటోలకు పోజు లిచ్చారు. న్యూయార్క్ మేయర్ ను కలుసుకోవడం పట్ల అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ గౌరవం చూపించిన మిస్టర్ ఎరిక్ ఆడమ్స్ కు ధన్యవాదాలు. తగ్గేదేలే! అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

మోహన్ బాబు యూనివర్శిటీ గుర్తింపు రద్దా? మంచు విష్ణు ప్రకటన

Mohanbabu: మోహన్ బాబు యూనివర్శిటీ లోని అభియోగాలపై ప్రో-ఛాన్సలర్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments