తగ్గేదేలే అంటోన్న అల్లు అర్జున్..

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (12:59 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్యూయార్క్ లో సందడి చేశారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన ఇండియా డే పరేడ్ కార్యక్రమానికి భార్య స్నేహారెడ్డి తో కలసి హాజరయ్యాడు. 
 
ఈ సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని చేత్తో పట్టుకుని రెపరెపలాండించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా 'గ్రాండ్ మార్షల్' అవార్డును ఇచ్చి అక్కడి వారు సత్కరించారు. తనకు గ్రాండ్ మార్షల్ అవార్డును ఇవ్వడం పట్ల అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపాడు.
 
సినిమా, వినోద ప్రపంచానికి అందించిన సేవలకు గాను ఈ గౌరవాన్ని అందించారు.  ఇక అల్లు అర్జున్ న్యూయార్క్ పర్యటనలో ప్రత్యేకత ఏమిటంటే.. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ను కలుసుకున్నాడు.
 
ఇద్దరూ కలసి పుష్ప మాదిరిగా తగ్గేదేలే అన్న సంకేతంగా గడ్డం కింద చేయి పెట్టుకుని ఫొటోలకు పోజు లిచ్చారు. న్యూయార్క్ మేయర్ ను కలుసుకోవడం పట్ల అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ గౌరవం చూపించిన మిస్టర్ ఎరిక్ ఆడమ్స్ కు ధన్యవాదాలు. తగ్గేదేలే! అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments