Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్‌ బాధితులతో అల్లు అర్జున్‌...

Webdunia
బుధవారం, 1 జులై 2015 (19:43 IST)
కేన్సర్‌తో బాధపడుతున్న నలుగురు చిన్నారులను సినీ హీరో అల్లు అర్జున్‌ పరామర్శించారు. మేక్‌ ఎ విష్‌ ఫౌండేషన్‌ ద్వారా చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న అల్లు అర్జున్‌ వారిని కలుసుని వారిని ఉత్సాహపరుస్తూ ఉల్లాసంగా గడిపారు. చిన్నారుల పరిస్థితిని వైద్యులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు గిప్ట్‌లు అందజేశారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చివరిదశలో ఉన్న చిన్నారుల కోరిక తీర్చడం గొప్ప విషయమని అన్నారు. ఈ దశలో పిల్లలకు సాయం చేయడం కంటే మనోధైర్యం ఇవ్వడమే ముఖ్యమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న మేక్‌ ఎ విస్‌ సంస్థకూ అందరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఆర్గనైజేషన్‌ తరపున పిలుపు వస్తే ఏ సెలబ్రెటి అయినా వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
 
పిల్లలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నీ మనం డబ్బుతో కొనలేమని అన్నారు. మేక్‌ ఎ విష్‌ ఫౌండేషన్‌  ఏర్పాటు చేసిన బైసైకిల్స్‌ను కొందరికి అల్లు అర్జున్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మేక్‌ ఎ విష్‌ ఫౌండేషన్‌  స్ఫూర్తిని ఆయన అభినందించారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments