మేమంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇండస్ట్రీలోకి ఎలా ప్రవేశించాలో తెలియన రోజులు.. అప్పడు అల్లు అరవింద్ పరిచయం అయ్యారు. ఆయన బ్యాక్బోన్గా నిలిచారు. ఆయనే సుకుమార్కు పరిచయం చేశారు. అప్పుడే 'నాన్నకు ప్రేమతో' కథ చెప్పాను. అదే ఎన్టిఆర్తో తీశారు. అంటూ కథకుడు, దర్శకుడు హుస్సేన్ షా తెలియజేశాడు.
తరుణ్ శెట్టి, అవంతిక, కిరిటీ దామరాజు, జెన్ని, భరణ్ ప్రధాన పాత్రల్లో నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మీకు మీరే మాకు మేమే'. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది.
''మేమంతా ఇంజనీరింగ్ చదివి సినిమాల మీద ప్యాషన్తో ఇక్కడకు వచ్చాం. షార్ట్ ఫిలింస్తో జర్నీ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఫీచర్ ఫిలి స్థాయికి వచ్చాం. తెలుగు సినిమా క్లాసిక్ మిస్సమ్మ చిత్రంలోని ఓ సీన్ని ఇన్స్పైర్ అయ్యి ఈ చిత్రాన్ని చేశాను. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తామని" అన్నారు.