Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో పొత్తు ఉండదు... తెగదెంపులే : సంకేతాలిచ్చిన చంద్రబాబు

భారతీయ జనతా పార్టీతో ఇక సయోధ్య ఉండదని, తెగదెంపులే ఉంటాయని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ టీడీపీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు.

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (09:34 IST)
భారతీయ జనతా పార్టీతో ఇక సయోధ్య ఉండదని, తెగదెంపులే ఉంటాయని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ టీడీపీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. 
 
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బుధవారం టీ టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఇందులో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు టీడీపీ కార్యకర్తలు టీ టీడీపీ అధ్యక్ష పదవిని హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని, తమతో చెప్పకుండా బీజేపీతో పొత్తుపెట్టుకోరాదంటూ నినాదాలు చేశారు. 
 
దీంత చంద్రబాబు స్వయంగా వారిని శాంతపరిచారు. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలకు తెలియకుండా ఏమి చేయనని స్పష్టంచేశారు. అదేసమయంలో బీజేపీతో పొత్తు ఉండబోదనే సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో పొత్తులపై నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. 
 
కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR Is The Trump of Telangana: ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణకు ట్రంప్‌లా వుండేవాడు..

Uppada: ఉప్పాడ భూమిని మింగేసిన సముద్రం- పవన్ కల్యాణ్ ఒత్తిడి వల్లే?

డిసెంబరు నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి : సీఎం చంద్రబాబు

అసెంబ్లీ సమావేశాలు : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు డిప్యూటీ సీఎం పవన్ ఘాటు కౌంటర్

నగరం లోపల నగరంగా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

తర్వాతి కథనం
Show comments