Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున - నాని మ‌ల్టీస్టార‌ర్ రెగ్యుల‌ర్ షూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్

కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ భారీ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యుల

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (14:04 IST)
కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ భారీ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మార్చి 18న ఉగాది రోజున ప్రారంభించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అగ్ర నిర్మాత అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ... మా వైజ‌యంతి బ్యాన‌ర్లో మ‌ణిశ‌ర్మ చేసిన సినిమాల‌న్నీ మ్యూజిక‌ల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. 
 
ఈ సినిమాని కూడా మ్యూజిక‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్ చేయ్యాల‌ని ఫుల్‌గా కాన్స‌న్‌ట్రేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అమెరికాలో ఈ సినిమాలోని సాంగ్స్‌ని మ‌ణిశ‌ర్మ కంపోజ్ చేస్తున్నారు. మూడు పాట‌ల‌కు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ అక్క‌డ జ‌రుగుతున్నాయి. మార్చి 18 ఉగాది రోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మా బ్యాన‌ర్‌లో ఎన్నో మ‌ల్టీస్టార‌ర్స్ చేశాం. అవ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్‌గా ఘ‌న విజ‌యాల్ని అందుకున్నాయి. 
 
ఇప్పుడు నాగార్జున‌, నాని కాంబినేష‌న్లో చేస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ కూడా బిగ్గెస్ట్ హిట్ అయి మా బ్యాన‌ర్‌కి మ‌రింత పేరు తెస్తుంది అన్నారు. డైరెక్ట‌ర్ టి.శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ... ఎంట‌ర్టైనింగ్ వేలో సాగే డిఫరెంట్ స‌బ్జెక్ట్ ఇది. నాగార్జున, నానిల‌తో వైజ‌యంతి బ్యాన‌ర్లో ఈ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం - మ‌ణిశ‌ర్మ‌, స్ర్కిప్ట్ అడ్వైజ‌ర్ - స‌త్యానంద్, సినిమాటోగ్ర‌ఫీ - శ్యామ్ ద‌త్, ఎడిటింగ్ - ప్ర‌వీణ్ పూడి, మాట‌లు - వెంక‌ట్ డి, ప‌ట్టి శ్రీరామ్, ఆర్. ఇర‌గం, కో-డైరెక్ట‌ర్ - తేజ కాకుమాను, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ - మోహ‌న్, నిర్మాత - అశ్వ‌నీద‌త్, క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం - టి.శ్రీరామ్ ఆదిత్య‌.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments