ఓటీటీలో విశ్వక్ సేన్ "అశోకవనంలో అర్జున కళ్యాణం"

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (16:32 IST)
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన నటించిన కొత్త చిత్రం "అశోకవనంలో అర్జున కళ్యాణం". ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పలు వరుస చిత్రాల విజయంతో మంచి జోష్ మీదున్న విశ్వక్ సేన్ ఇపుడు విభిన్నమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చిన విషయం తెల్సిందే. 
 
రొమాంటింక్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల 6వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో విశ్వక్ సేన్ అర్జున పాత్రలో ఒదిగిపోయిన తీరుకు విమర్శకులు సైతం ప్రసంశలు కరిపించారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూన్ 3వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడీగా రుక్సార్ ధిల్లాన్, రితికా నాయక్‌లు హీరోయిన్లుగా నటించారు. 
 
బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్.వి.సి.సి పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదరలు సంయుక్తంగా నిర్మించారు. కాగా, ప్రస్తుతం విశ్వక్ సేన ఓరి దేవుడో అనే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments