మన్మథుడు-2లో మహానటి కాంబో..? మళ్లీ స్క్రీన్‌పై సమంత, కీర్తి సురేష్?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (11:04 IST)
కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోన్న చిత్రం ''మన్మథుడు 2''. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
త్వరలో పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మహానటి నటించనుందని టాక్. అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే సమంత ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, కీర్తి సురేశ్ కూడా మరో కీలక పాత్రను పోషిస్తుందన్నది తాజా సమాచారం.
 
ఇకపోతే.. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం నటించడం లేదట. మన్మథుడు చిత్రానికి బ్రహ్మానందం కామెడీ ఎంత ప్లస్సో అందరికీ తెలిసిందే. అలాంటిది ‘మన్మథుడు 2’ చిత్రంలో బ్రహ్మానందం లేడనే విషయం సినీ ప్రేమికులను నిరాశపరచడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
కానీ బ్రహ్మానందం స్థానంలో ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ నటించనున్నాడట. కానీ మన్మథుడు-2లో బ్రహ్మీని మ్యాచ్ చేయడం ఎవరితరం కాదని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments