Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడు-2లో మహానటి కాంబో..? మళ్లీ స్క్రీన్‌పై సమంత, కీర్తి సురేష్?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (11:04 IST)
కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోన్న చిత్రం ''మన్మథుడు 2''. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
త్వరలో పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మహానటి నటించనుందని టాక్. అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే సమంత ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, కీర్తి సురేశ్ కూడా మరో కీలక పాత్రను పోషిస్తుందన్నది తాజా సమాచారం.
 
ఇకపోతే.. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం నటించడం లేదట. మన్మథుడు చిత్రానికి బ్రహ్మానందం కామెడీ ఎంత ప్లస్సో అందరికీ తెలిసిందే. అలాంటిది ‘మన్మథుడు 2’ చిత్రంలో బ్రహ్మానందం లేడనే విషయం సినీ ప్రేమికులను నిరాశపరచడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
కానీ బ్రహ్మానందం స్థానంలో ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ నటించనున్నాడట. కానీ మన్మథుడు-2లో బ్రహ్మీని మ్యాచ్ చేయడం ఎవరితరం కాదని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments