Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు కంటికి ఆపరేషనా.. ఏమైంది..? శ్రీవారు మౌనంగా వున్నారు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటికి శస్త్రచికిత్స జరుగనుంది. ఈ నెల 24వ తేదీన కంటికి ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు నిర్ణయించారు. గత మూడు నెలలుగా ఆయన కంటి సమస్యతో పవన్ బాధపడుతున్నారు.

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (15:54 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటికి శస్త్రచికిత్స జరుగనుంది. ఈ నెల 24వ తేదీన కంటికి ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు నిర్ణయించారు. గత మూడు నెలలుగా ఆయన కంటి సమస్యతో పవన్ బాధపడుతున్నారు. అందుకే తన పోరాట యాత్రలో నల్లటి కళ్లజోడు ధరించి కనపడ్డారు. మరోవైపు ఈనెల 26 నుంచి ఆయన యాత్ర విశాఖ జిల్లాలో పున:ప్రారంభం కానుంది. 
 
తన భద్రతా సిబ్బందిలో ఉన్న ముస్లింల కోసం రంజాన్ సందర్భంగా యాత్రకు ఆయన తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ గ్యాప్ లోనే కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని భావించారు. అయితే, కొంతకాలం ఆగాలని వైద్యులు సూచన మేరకు శస్త్రచికిత్స వాయిదా పడింది. కంటిలో ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ఆపరేషన్ చేస్తున్నట్లు సమాచారం. 
 
మరోవైపు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి నగలకు సంబంధించి పెద్ద చర్చే జరుగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌ను కలిశానని.. ఆయన ఈ భేటీ సందర్భంగా టీటీడీ నగలపై కీలక విషయాలను తనకు చెప్పారని.. ఈ విషయం విపక్ష నేతలు, టీడీపీ నేతలకు కూడా తెలుసునని తెలిపారు. 
 
స్వామివారి నగలు మధ్యప్రాచ్య దేశాలకు ఓ ప్రైవేట్ విమానంలో తరలివెళ్లాయని.. అందుకే తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు తనకు ఆశ్చర్యం అనిపించలేదన్నారు. వేంకటేశ్వరస్వామి మౌనంగా ఉన్నారు... ఆయన నగలను దొంగిలించవచ్చని దొంగలు అనుకుంటున్నారు అంటూ ట్వీట్ చేశారు. 
 
పింక్ డైమండ్, ఇతర నగలకు సంబంధించి ఏపీ సర్కారు చెప్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవని.. పింక్ డైమండ్ భక్తులు నాణేలు విసరడం ద్వారా పగిలిపోయిందని చెప్పడం నమ్మశక్యంగా లేవన్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో నాణేలు విసిరితే వజ్రం ఎలా పగులుతుందో చేసి చూపించాలని పవన్ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments