Webdunia - Bharat's app for daily news and videos

Install App

6500 థియేటర్లలో బాహుబలి 2: దానికోసం పోటీపడుతున్న అనుష్క, ప్రభాస్..

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సీక్వెల్ బాహుబలి2 ప్రపంచ వ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదల కానుంది. తద్వారా అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా బాక్సాఫీసు రిక

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (14:50 IST)
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సీక్వెల్ బాహుబలి2 ప్రపంచ వ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదల కానుంది. తద్వారా అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా బాక్సాఫీసు రికార్డు సృష్టించనుంది.

రానా దగ్గుబాటి, ప్రభాస్, అనుష్క, తమన్నా నటిస్తున్న ఈ సినిమా తొలి భాగమైన బాహుబలి రూ.600 కోట్లు సంపాదించింది. తద్వారా ప్రపంచ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ రికార్డును బాహుబలి2 తిరగరాయనుందని టాక్ వస్తోంది. బాహుబలి2 సినిమా కోసం రూ.450 బడ్జెట్ కింద ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని బాహుబలి2 విడుదలైన వారం రోజుల్లోనే సంపాదించేస్తాడని సమాచారం.
 
ఈ నేపథ్యంలో బాహుబలి తారాగణం సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉంది. పనిలో పనిగా తమ తదుపరి సినిమాలను కూడా ప్రమోట్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాహుబలి 2 సినిమా విడుదలను క్యాష్ చేసుకునేందుకు.. ప్రభాస్, అనుష్క రెడీ అవుతున్నారు. ప్రభాస్ నాలుగేళ్ళ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ని రూపొందించాడు. 
 
ఈ సినిమాకి సంబంధించి ముందుగా ఓ టీజర్‌ని రూపొందించి బాహుబలి2తో పాటుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక బాహుబలిలో దేవసేనగా నటించిన అనుష్క భాగమతి అనే క్రేజీ ప్రాజెక్ట్‌ని ఇటీవలే పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుంటుంది.

అయితే ఈ చిత్ర ట్రైలర్‌ని కూడా బాహుబలి ది కంక్లూజన్ మూవీతో పాటుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తద్వారా బాహుబలి క్రేజ్‌ను.. తదుపరి సినిమాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రభాస్, అనుష్క పోటీపడుతున్నారు. ఇప్పటికే పాటలు విడుదలైనాయి. ఈ పాటలకు నెట్టింట్లో భారీ క్రేజ్ లభిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments