Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న 'వానపాటల' హీరోయిన్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆర్జీవీపై ఆమె అంతలా కోపం పెంచుకోవడానికి కారణమేంట

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (16:22 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆర్జీవీపై ఆమె అంతలా కోపం పెంచుకోవడానికి కారణమేంటనే కదా మీ సందేహం. 
 
ఆర్జీవీ తెరకెక్కించనున్న 'లక్షీస్ ఎన్టీఆర్' సినిమాపై ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం చెలరేగింది. ఇప్పటివరకు వర్మపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా... తాజాగా, టీడీపీలో చేరుతానని ప్రకటించిన సినీ నటి వాణీ విశ్వనాథ్ కూడా ఆ జాబితాలో చేరారు. 
 
ప్రజలు దేవుడిగా చూసే ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సినిమాను తీస్తే, చూస్తూ ఊరుకోబోమని... ఇలాంటి సినిమాను తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే ఆపేయాలని అన్నారు. లేనిపక్షంలో వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్‌లో రాముడిని, కృష్ణుడిని ప్రజలు చూసుకున్నారని అన్నారు.
 
ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను బాలకృష్ణ తీయబోతున్న తరుణంలోనే... ఇలాంటి సినిమాను తీయడానికి వర్మ ప్రయత్నిస్తుండటం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాకు వర్మ పెట్టిన పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉన్నాయని వాణీ విశ్వనాథ్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments