Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (09:56 IST)
ప్రముఖ సినీ నటి త్రిష చెన్నైలోని మరో ఆలయానికి ఏనుగును విరాళంగా అందజేశారు. స్వతహాగా జంతు ప్రేమికురాలైన త్రిష... జంతు సంక్షేమ సంస్థ పీఎఫ్‌సీఐతో కలిసి విరాళంగా ఇచ్చారు. 
 
చెన్నైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి గజ అని పేరు పెట్టిన రోబోటిక్ ఏనుగును త్రిష కానుకగా ఇచ్చారు. గురువారం మంగళవాయిద్యాల మధ్య, వేద మంత్రోచ్ఛారణల నడుమ పీఎఫ్‌సీఐ సంస్థ నిర్వాహకులు ఈ యత్రిక ఏనుగును ఆలయ పూజారులకు శాస్త్రోక్తంగా అప్పగించారు. ఇకపై ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాల్లో ఈ రోబో ఏనుగు వినియోగించనున్నారు. 
 
సాధారణంగా ఆలయ వేడుకల్లో నిజమైన ఏనుగులను ఉపయోగించడం వల్ల అవి శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని జంతు ప్రేమికులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టులకెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మూగజీవాలకు ఎలాంటి హాని కలగకుండా సాంప్రదాయాలను కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో ఈ రోబోటిక్ ఏనుగును అందించడం ఒక గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments