Webdunia - Bharat's app for daily news and videos

Install App

కథలువింటున్న అతిలోక సుందరి... త్వరలో కుమార్తెలు తెరంగేట్రం...

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (11:49 IST)
అలనాటి అందాల తార శ్రీదేవి పెళ్లి, పిల్లలు అంటూ కొంత గ్యాప్ ఇచ్చి, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ అయిన తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈమె ఇటీవల కొత్త కథలు వింటోందట. అయితే ఆమె కథలు వినేది తన కోసం కాదట, తన ముద్దుల కుమార్తెలు జాహ్నవి, ఖుషీ కపూర్‌ల కోసమట. 
 
శ్రీదేవి తన కుమార్తెలను వెండితెరకు పరిచయం చేయాలని అనుకుంటుందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తూనే వున్నాయి. అయితే ఆ విషయం గురించి అడిగినప్పుడంతా సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ వచ్చింది. ఈ స్థితిలో ఇటీవల శ్రీదేవి పలువురి వద్ద నుంచి కథలు వింటుందట. శ్రీదేవికి కథ నచ్చడమే తరువాయి .. ముందుగా వెండితెరపైకి పెద్ద కూతురు జాహ్నవిని పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా శ్రీదేవి ఒక వైపున నటిగా తాను తిరిగి బిజీ అవుతూనే.. మరోవైపు తన కుమార్తెలను కూడా వెండితెరకు పరిచయం చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోందని సమాచారం. ఆమె ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments