Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి కుమార్తెకు అరుదైన గౌరవం -- వరించిన ప్రతిష్టాత్మక అవార్డు

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (15:38 IST)
అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు అరుదైన గౌరవం లభించింది. "రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు"కు జాన్వీకపూర్ ఎంపికైంది. ముంబైలోని నార్వేజియన్ కాన్సులేట్ జనరల్ ఈ అవార్డును జాన్వీకపూర్‌కు మంగళవారం ప్రదానం చేయనుంది.
 
నిజానికి జాన్వీ కపూర్ నటించింది కేవలం ఒకే ఒక చిత్రం మాత్రమే. "దఢక్" చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్... ఈ చిత్రంలో మంచి నటననే ప్రదర్శించింది. దీంతో ఆమెకు మంచి మార్కులు పడటమేకాకుండా, అనేక మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో 'రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'కు జాన్వీ కపూర్ ఎంపికైంది.
 
దీనిపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ, ఈ ఏడాది 'దఢక్' చిత్రంతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చా. నార్వేలో ఉన్నవారితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూశారు. నార్వే ప్రజలు సోషల్‌మీడియా ద్వారా దఢక్ చిత్రానికి ప్రశంసలు, ఆశీస్సులు అందించారు. 
 
ఇలాంటి అరుదైన గుర్తింపు రావడం ఆశ్చర్యంగా, గొప్ప అనుభూతిని కలిగించేలా ఉంది. 'రైజింగ్ ఆఫ్ ది ఇయర్ టాలెంట్ అవార్డు' రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఇది ఎంతో సంతోషకరమైన విషయమని ఆమె వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments