Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనమ్ పాండేకు చిక్కులు.. లాక్‌డౌన్ ఉల్లంఘించి స్నేహితుడితో చక్కర్లు

Webdunia
సోమవారం, 11 మే 2020 (11:11 IST)
బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పూనమ్ పాండే మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించి తన స్నేహితుడితో కలిసి ముంబై రోడ్లపై కారులో చక్కర్లు కొట్టినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలీవుడ్ నటి పూనమ్ తన మిత్రుడైన సినీ దర్శకుడు అహ్మద్ బాంబేతో కలిసి ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో బీఎండబ్ల్యూ కారులో బంద్రా నుంచి మెరైన్ డ్రైవ్‌కు బయలుదేరారు.
 
వీరి కారును ఆపిన మెరైన్ డ్రైవ్ ప్రాంత పోలీసులు, బయటకు వచ్చిన కారణాన్ని అడుగగా, సరైన సమాధానం చెప్పక పోవడంతో, ఇద్దరినీ అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారిని వదిలేశారు. ఈ విషయాన్ని జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ సంగ్రామ్‌సింగ్ నిశందర్ వెల్లడించారు. పైగా, లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించినందుకుగాను వారిద్దరిపైనా ఐపీసీ సెక్షన్ 188, 269 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments