Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి మీరా చోప్రా కేసు ఢిల్లీకి బదిలీ.. కారణం ఏమిటంటే?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:13 IST)
Meera Chopra
సినీ నటి మీరా చోప్రా కేసు ఢిల్లీకి బదిలీ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీరా చోప్రా సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. 
 
ఇటీవల సోషల్ మీడియాలో చిట్‌చాట్‌లో పాల్గొన్న మీరా చోప్రా తనకు ఎన్టీఆర్ కంటే మహేశ్‌బాబు అంటే ఇష్టమని పేర్కొన్నారు. అంతేగాకుండా ఎన్టీఆర్ గురించి తెలియదన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ట్విట్టర్ వేదికగా ఆమెను దుమ్మెత్తిపోయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
దీంతో స్పందించిన నటి ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది ఖాతాల నుంచే ఆమెకు అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. కాగా, నటి ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంకా ''67ఎ''ను కూడా జతచేసిన పోలీసులు... మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

విడోలు, విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్.. కోట్లు దోచేశాడు..

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్.. ఏం జరిగింది?

కేసీఆర్ ఇంటర్వ్యూ.. అవును వైఎస్సార్ సంక్షేమ పథకాలను అనుసరించాను..

ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

మీ స్మార్ట్‌ఫోన్లే మీ ఆయుధాలు.. సీఎం జగన్ పిలుపు

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

రాత్రులు చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు తింటున్నారా.. ఐతే అదే కారణం?

కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు

ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?

జీడిపప్పు ఎన్ని తినాలి? జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments