అమ్మాయిలపై పాటలు రాసే వారందరిపై కేసులు పెడతా.. మాధవీలత

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (14:57 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "పుష్ప". ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. అదేసమయంలో ఓ రేంజ్‌లో వివాదాన్ని రేపుతున్నాయి. ప్రధానంగా ఈ చిత్రంలోని సమంత నటించిన ఐటమ్ సాంగ్ మరింత వివాదాన్ని రేపింది. 
 
ఈ పాటను తొలగించాలని ఏపీలో పురుషుల సంఘం ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. మగాళ్లంతా చెడ్డోళ్ళంటూ అర్థం వచ్చేలా ఆ పాట ఉందని, దానిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు.. ఆ పార్టీకు డ్యాన్స్ చేసిన సమంతపై కూడా కేసు పెట్టింది. 
 
ఈ పాటపై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశంపై ఆమెప ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. "వాయమ్మె 'పుష్ప' మూవీ సాంగ్ మీద కేస్ అంటగా, ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీ చెయ్యాలి. నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. 
 
'పుష్ప'లోని 'రారా సామీ' పాట కేసు వేస్తా. ఏంటి ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పోలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా? అబ్బాయి నడిచిన చోట భూమిని మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. 'ఛ నాకు నచ్చలే. నేను పెడతా కేసు. అంతే.. తగ్గేదేలే' అంటూ ఆమె పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments